Sunday, April 28, 2024

సిద్దిపేటలో మెగా జాబ్ మేళా…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట బిడ్డలకు సిద్దిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషమని.. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పోలీసు కన్వెన్షన్ సెంటరులో మంగళవారం ఉదయం స్థానికులకే స్థానిక ఉద్యోగాలు పేరిట ప్రముఖ 15 ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఐటీ టవర్ రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. మీ కెరీర్ తో ప్రారంభమై.. మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరాలని, గతంలో ఏం చేశారనే-గ్యాప్ ఎందుకుందనే అంశం ఐటీ సెక్టారులో అడిగే ఆస్కారం ఉన్నందున ముందు ఈ ఐటీ హబ్ లో ఉద్యోగ అవకాశం పొందితే మీ కెరీర్ గ్యాప్ లేకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Minister Harish Rao launches Mega Job Mela in Siddipetసిద్దిపేటలో సైతం 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవరులో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరంగా ఉన్నదన్నారు. రూ.63 కోట్ల వ్యయంతో సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టినట్లు, ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఓఎస్ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫో టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్, తదితర కంపెనీలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

షిఫ్టు బేస్డుగా 718 మంది ఉద్యోగులు ఉంటారని, రెండు షిఫ్టులకు 1436 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు పద్ధతులు స్టేజ్-1లో 718, స్టేజ్-2 లో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయని, ఈ నెల 15వ తేదీన సిద్ధిపేటలో ఐటీ హబ్ ప్రారంభం అవుతుందని మంత్రి హరీశ్ వెల్లడించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందే ఉద్యోగార్థులకు టాస్క్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు, కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శిక్షణ ఇచ్చే టాస్క్- తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Minister Harish Rao launches Mega Job Mela in Siddipetప్రతి బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ అభ్యర్థులకు 45 రోజులు పాటు టాస్క్ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. టాస్క్ శిక్షణ పొందిన తర్వాత ఎక్కడైనా ఐటీ, తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని మంత్రి వెల్లడించారు. ఇవాళ 718 మంది ఉద్యోగార్థులను ప్రముఖ కంపెనీలు ఎంపిక చేసుకుంటాయని, అన్నీ చదువులు సిద్దిపేటలో ఉన్నాయని, ఇప్పటికే సిద్దిపేట విద్యా క్షేత్రంగా నిలిచిందని, ఇవాళ్టి నుంచి ఉద్యోగాల హబ్ గా మారిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణు గోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News