Sunday, April 28, 2024

మానవతను చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar Help to Mcom Student

 

కరీంనగర్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్ గ్రామానికి చెందిన శంకరయ్య గారి కుమార్తె జింక తన్మయ చిన్నతనంలో రెటినైటిస్ స్పిగ్ మెంటోస్ వ్యాధి తో కంటిచూపు కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా ఎమ్.కాం పూర్తి చేసింది. ప్ర‌స్తుతం సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఆన్‌లైన్ క్లాసులు వినడానికి ల్యాప్‌టాప్ కొన‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నాన‌ని, కుటుంబం తీవ్ర పేద‌రికంలో ఉంద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌కు 15 రోజుల క్రితం త‌న్మ‌య వివరించింది. త‌న్మ‌య బాధ‌ను అర్థం చేసుకున్న మంత్రి దివ్యాంగుల శాఖ నుంచి రూ. 50 విలువ చేసే ల్యాప్‌టాప్‌ను ఆమెకు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి చూపిన ఉదారత పట్ల తన్మయ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. తమ కుటుంబానికి మంత్రి చేసిన సహాయం గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న ఈశ్వర్ గారిని జీవితాంతం గుర్తుంచుకుంటామని వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News