Monday, April 29, 2024

కెటిఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకు హాజరుకావాలని మంత్రి కెటిఆర్‌కు నిర్వాహకులు సూచించారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు జర్మనీలోని నగరంలో జరుగుతుంది. ‘కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టం’ అనే అంశంపైన ఈ సమావేశం జరుగుతుందని, ఈ సదస్సుకు హాజరై ప్రసంగించాలని మంత్రి కెటిఆర్‌కు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. జర్మనీకి సెనెట్ చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్ శాఖ మంత్రి కెటిఆర్‌కు ఈ ఆహ్వానాన్ని పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్‌తో పాటు తెలంగాణ, ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆ సంస్థ కోరింది.

ప్రతి ఏటా ఈ సదస్సు ద్వారా జర్మనీ, అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్‌లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. దీంతోపాటు ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుంది. అద్భుతమైన ఐడియాలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్టప్‌లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కెటిఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News