- Advertisement -
చెన్నై : అన్నాడిఎంకె రాజ్యసభ సభ్యుడు ఎ మహమ్మద్ ఖాన్ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయస్సు72 సంవత్సరాలు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతున్న సమయంలో రాణీపేట లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలారు.2011నాటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె అభ్యర్థి ఆర్ గాంధీపై మహమ్మద్ ఖాన్ విజయం సాధించారు. జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వసవరణ బిల్లుకు ఖాన్ మద్దతు తెలిపారు. దీంతో ఆయన నియోజక వర్గంలో ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన సాగించారు. స్థానిక జమాత్లో ఆయన నిర్వహిస్తున్న పదవి నుంచి ఆయనను తొలగించారు.
- Advertisement -