- Advertisement -
ముంబయి: బంగారు ఆభరణాల విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య గొడవ జరగడంతో కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో తల్లి ఏడో అంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని ఓషివర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దయానందర్ హనుమంత్ బంగార్లో నివసించే ఓ కుటుంబంలో ఓ కూతురు (32) బంగారం విషయంలో తన తల్లితో (55) గొడవకు దిగింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ ఎక్కువ కావడంతో కూతురు ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే తండ్రి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ఇదే సమయంలో తల్లి ఏడో ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mother Jumps to Death with Her Daughter Suicide,daughter too had tried to commit suicide by drinking phenyl, Mother jumbp from Seventh Floor
Mother Jumps to Death with Her Daughter Suicide
- Advertisement -