Monday, April 29, 2024

ఎంపి అసదుద్దీన్ ఒవైసీకు నాన్ బెయిలబుల్ వారెంట్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీకు ప్రత్యేక కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకాకపోవడం వల్లే ప్రత్యేక కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, 2015లో మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అనంతరం కారులో తిరుగు పయనం అయ్యారు. ఆ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డగించారు. మరికొందరైతే కారులో కూర్చున్న షబ్బీర్ అలీపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా అక్కడే ఉన్నారు.కాగా, తనపై జరిగిన దాడిని నిరసిస్తూ షబ్బీర్ అలీ మీర్‌చౌక్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఘటనకు బాధ్యుడిగా అసదుద్దీన్‌ను చేర్చారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దానిపై విచారించిన ధర్మాసనం ఆయనను విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Non-bailable warrant issued to MP Asaduddin Owaisi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News