Monday, April 29, 2024

ఎన్‌టిఆర్ శత జయంతి… నివాళులర్పించిన జూనియర్ ఎన్‌టిఆర్, కల్యాణ్ రామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్‌టిఆర్, కల్యాణ్ రామ్ లు చేరుకొని నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు తాత చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్ ఘాటు వద్దకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.  ” మీ పాదం మోపాక తెలుగు దరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా” అంటూ జూనియర్ ఎన్ టిఆర్ సోషల్ మీడియా పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News