Monday, April 29, 2024

‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. శ్రీలీలతో ‘అమ్ములు.. రాముగాడు గుర్తెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది’ అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ తో ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయికలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘గుంటూరు కారం’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా… అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

తాజాగా ‘ఓ మై బేబీ’ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ప్రోమోనను వదిలిన మేకర్స్.. ఫుల్ లిరికల్ వీడియోను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇక, ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతి బాబు, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు చేస్తుండగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్‌గా భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News