- Advertisement -
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ చాలీసాను పఠిస్తారని యోగి వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కిరారిలో ఎన్నికల ర్యాలీనుద్దేశించి యోగి ప్రసంగిస్తూ ఇప్పటివరకు కేజ్రీవాల్ ఒక్కరే హనుమాన్ చాలీసా పఠించారని, ఇక తర్వాత ఏం జరగనున్నదో వేచి చూడండని అన్నారు. ఏదో ఒకరోజు ఒవైసీ కూడా పవిత్ర హనుమాన్ చాలీసా పఠిస్తారని ఆయన అన్నారు. ఈ నాయకులంతా ఒకపక్క షహీన్బాగ్ నిరసనకారులకు బిర్యానీ వడ్డిస్తారని, మరోపక్క హనుమాన్ చాలీసా పఠిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
Owaisi will recite Hanuman Chalisa: UP CM
- Advertisement -