హిమాచల్ ప్రదేశ్: అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ చరిత్రాత్మకమైన రోజని ఆయన అన్నారు. ఈ సొరంగమార్గం నిర్మాణంతో వాజ్ పేయీ కల సాకారమైందని పేర్కొన్నారు. వాజ్ పేయీ స్వప్నాలను మేం సాకారం చేశామని చెప్పారు. అటల్ సొరంగ మార్గం వల్ల కోట్లమంది స్థానికులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి ఈ సొరంగమార్గం పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. సొరంగమార్గం పూర్తి చేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి ప్రధాని అభినందనలు తెలిపారు. అటల్ టన్నెల్ వల్ల 3నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుంది పిఎం మోడీ తెలిపారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్ర్రాంతంలోని ఫిర్ ఫంజల్ పర్వతశ్రేణిలో 9.02 కి.మీ. మేర అటర్ సొరంగ మార్గాన్ని మనాలి నుంచి లేహ్ వరకు నిర్మించారు. రూ. 3,500 కోట్ల వ్యయంతో పదేళ్లపాటు నిర్మించిన అటల్ సొరంగమార్గంతో లేహ్ నుంచి మనాలకి 475 కి.మీ. నుంచి 46కి.మీ. వరకు దూరం తగ్గనుంది.
PM Modi Says Atal Bihari Vajpayee dream come true