జగదిరిగుట్ట: హైదరాబాద్ జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ విషాదం గురువారం విషాదం చోటుచేసుకుంది. వరకట్నం వేధింపులు తట్టుకోలేక కృష్ణ ప్రియ (24) అనే వివాహిత ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. భర్త, అత్తమామలు వేధింపుల వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకుని, మరో 12 లక్షల కట్నం ఇవ్వాలని కృష్ణప్రియ భర్త శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసినట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమంతానికి ఐదు కాసులు బంగారం పెడితేనే తన బిడ్డను ఇంటికి పంపుతామని అత్తింటివారు డిమాండ్ చేసినట్టు బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Pregnant Woman Commits Suicide in Hyderabad