Monday, April 29, 2024

మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు

- Advertisement -
- Advertisement -

ktr

 

జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు
నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలి
ప్రభుత్వపరంగా వారికి పునరావాసం కల్పించాలి
లాక్‌డౌన్‌లోనూ నగరంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు
ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న రాష్ట్రాల్ల్లో తెలంగాణదే అగ్రస్థానం
హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్షం
అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ లింక్ రోడ్ల వల్ల భవిష్యత్తుల్లో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే ఈ రోడ్ల కారణంగా నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్ డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణము నకు అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణం లో వున్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శనివారం బుద్దభవన్‌లో జిహెచ్‌ఎం మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్‌లతో కలిసి హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ క్రింద చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి కెటిఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశంలో లాక్ డౌన్ ను చక్కగా వినియోగించుకున్న రాష్టంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం ప నులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ము ందుకు సాగాలని ని మంత్రి కెటిఆర్ సూచించారు.

జూన్ నుంచి వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్లలో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధిఈ సమీక్ష సమావేశంలో మాజీ ఎంపి, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సిసిపి దేవేందర్ రెడ్డి, ఇఎన్‌సి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, ఎస్‌ఇలు, ఇఇలు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.

 

Road Construction works in the City
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News