- Advertisement -
న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్శర్మ ధైర్య సాహసాలున్న ఉద్యోగి. అల్లర్లలో ఆయన అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన పట్ల దేశం గర్వపడుతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి కూడా రూ.కోటి ప్రకటించిన సంగతి తెలిసిందే. గతవారం అల్లర్లలో చాంద్బాగ్ ప్రాంతంలో ఒక కాలువలో అంకిత్శర్మ మృతదేహం కనిపించడం సంచలనం కలిగించింది.
Rs 1 Cr compensation for Ankit Sharma’s family: Kejriwal
- Advertisement -