- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్ సంస్థ సామ్సంగ్ ప్రిబుకింగ్ ఆఫర్లను ప్రకటించింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత టెలివిజన్, డిజిటల్ అప్లయెన్సెస్ కొనుగోలు చేసేవారికోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సంస్థ రిటైల్, పంపిణీ చానెల్స్ వద్ద తగు ఏర్పాట్లను చేసింది. తద్వారా వినియోగదారులు తమ ఇళ్ల నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఉత్పత్తులను బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది. మే 8 వరకుబుక్ చేసుకోవచ్చు. 15 శాతం వరకూ రాయితీని, 18 నెలలపాటు దీర్ఘకాలపు రుణ సదుపాయాలతో వడ్డీ లేని సులభ వాయిదాలను పొందవచ్చు. వీటితో పాటుగా ఎక్స్ప్రెస్ డెలివరీ లభిస్తుంది.
Samsung Pre booking S20 smartphones
- Advertisement -