- Advertisement -
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనాన్ని చవిచూసాయి. రిలయన్స్, ఐటి స్టాక్స్ మార్కెట్ను పతనావస్థలోకి లాగాయి. ముంబయి స్టాక్ బెంచ్మార్క్ అయిన సెన్సెక్స్ 336.46 పాయింట్లు లేక 0.55 శాతం 60923.50 వద్ద స్థిరపడగా, నిఫ్టీ50 88.50 పాయింట్లు పడి 18178.10 వద్ద స్థిరపడింది. లాభపడిన షేర్లలో కొటక్ మహీంద్ర బ్యాంక్, ఆర్బిఎల్, హౌజింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డిఎఫ్సి) ఉండగా, నష్టపోయిన షేర్లలో రిలయన్స్, టిసిఎస్, ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ, కోఫోర్జ్, ఎల్ అండ్ టి టెక్సర్వీసెస్, హిందుస్థాన్ జింక్, వెల్స్పన్ కార్పొరేషన్ ఉన్నాయి.
- Advertisement -