- Advertisement -
సిద్దిపేట: విద్యారంగంలో సిద్దిపేటను నెంబర్ వన్ నిలుపుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ స్థాయి ఐఎస్ఒ సర్టిఫికేషన్ రావడంతో సర్టిఫికెట్ ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అగ్రస్థానంలోనిలిపేందుకు కృషి చేస్తున్నామని, కరోనా తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎం ఒఎస్డి దేశపతి శ్రీనివాస్, ఐఎస్ఒ ప్రతినిధి శివయ్య పాల్గొన్నారు.
- Advertisement -