- Advertisement -
అమరావతి: తల్లిదండ్రులపై తనయుడు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తన భార్యతో తల్లిదండ్రులు గొడవలు పెట్టుకోవడంతో కోపంతో ఊగిపోయిన కుమారుడు వీర రఘవయ్య వారిపై గొడ్డలి, కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి వీరలంకమ్మ ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా తండ్రి నాగేశ్వర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
- Advertisement -