Monday, April 29, 2024

సినిమా గ్లామర్ పులుముకున్న గ్రీన్‌ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

SS Rajamouli who planted the plants

 

రాంచరణ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి
మొక్కలు నాటి సందడి చేసిన రకుల్ ప్రీతి

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌కు సినిమాగ్లామర్ తోడైంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సినిమానటులు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటూ రీల్ కథానాయకలు, నాయికలు పర్యావరణ ప్రేమికులు అవుతున్నారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నటులు రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటుతున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ విసిరిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందంతో కలిసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం లింగంపల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం రాజమౌళిమాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం రాజమౌళి దర్శకులు రాంగోపాల్‌వర్మ, పూరీ జగన్నాథ్, వివి. వినాయక్‌తో పాటుగా తన ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్ తరపున మెగాస్టార్ ఆచార్య, యంగ్ రెబల్ స్టార్ రాధేశ్యాం, అల్లు అర్జున్ పుష్ప చిత్రబృందాలకు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.

అక్కినేని నాగచైతన్య ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ స్వీకరించి మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్‌లోని ఎంఎల్‌ఎ,ఎంపి కాలనీలో మొక్కలు నాటి మాట్లాడుతూ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరు కాదు అందరూ కలిసి చేయాల్సిన కార్యక్రమమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అల్లూరి పాత్రదారుడు రాంచరణ్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను వెంటనే స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ఎంపి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో అభినందించారు. ఈ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా ఉందన్నారు. అలాగే మొక్కలు నాటి మంచి మాటలు చెప్పిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిని సంతోష్‌కుమార్ అభినందించారు.

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో ప్రముఖ బాలివుడ్ నటీ నబా నటేష్ బెంగుళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం హీరోయిన్లు అనూ ఇమాన్యుల్, నిధి అగర్వాల్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లకు నబా నటేష్ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. సినిమా నటీ సునితా మనోహర్ ఇచ్చిన గీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి సినిమా హీరో విజయ్ శంకర్ మొక్కలు నాటారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లో మొక్కలు నాటిన విజయ్ శంకర్ హీరోయిన్ మౌర్యని, డైరెక్టర్ వీరభద్ర చౌదరి, మాజీ ఇసి సభ్యుడు సి.వి. గోవిందారావులకు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ బి.గోపి ఇచ్చిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి పిర్జాదిగూడ మన్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ మొక్కలు నాటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News