మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని తెలిసింది. కొరటాల శివ ఇప్పటికే ఈ పాత్ర గురించి మహేష్కి చెప్పగా ఈ సూపర్స్టార్ అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించారట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ను షూట్ చేసినట్లు తెలిసింది.
ఇంటర్వెల్లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సామాజిక సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని తెలిసింది.