- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఎవరూ ఆకలితో బాధపడొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని సిపి అంజనీకుమార్ తెలిపారు. కరోనా నివారణకు పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వినూత్న ప్రచారం చేపట్టారు. ఎంజె మార్కెట్ కూడలిలో కరోనా వైరస్ నమూనాతో హెల్మెట్ను సిపి అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. పోలీసుల ఆధ్వర్యంలో పేదవారికి ఆహారం పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
Surveillance on Delhi Prayers in Masjid says Hyd CP
- Advertisement -