Monday, April 29, 2024

విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి: సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Sushanth was poisoned before death: MP Subramanian

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడని ప్రకటించారు. సుశాంత్ కడుపులో ఉన్న విషం ఆనవాళ్లు లేకుండా పోయేంత వరకు వేచి చూసి, తర్వాత శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని దుయ్యబట్టారు. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు. ఇక సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే.

Sushanth was poisoned before death: MP Subramanian

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News