Monday, April 29, 2024

‘బాబుతో నేను’ పోస్టర్ ఆవిష్కరించిన టి టిడిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నిలవడం కోసం ‘బాబుతో నేను’ పోస్టర్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆవిష్కరించారు. అనంతరం ఈ పోస్టర్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గేట్ ముందు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచేవారందరూ ఈ పోస్టర్ పై సంతకం చేయాలని ఆమె కోరారు.

తెలుగుదేశం కార్యకర్తలే గాక, రోడ్డు వెంట వెళ్లేవారు సైతం చంద్రబాబుకు మద్దతుగా ఈ పోస్టర్ పై సంతకాలు చేయవచ్చునని, జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సాంబశివరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, రాష్ట్ర ఎస్‌సి సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, నల్లగొండ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలా పద్మావతి , ఐటీ ఉద్యోగులు, ఎన్టీఆర్ భవన్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News