Monday, April 29, 2024

ఈ బడ్జెట్‌ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Telangana Budget 2021 Live Updates

హైదరాబాద్: వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బయల్దేరుతున్నానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి హరీశ్‌  గురువారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా.. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్టు ఆయన తెలిపారు. స్వామివారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ బడ్జెట్‌ ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నిరకాలుగా మేలు చేస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

Telangana Budget 2021 Live Updates

Telangana Budget 2021 Live Updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News