సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తెరపైకి ‘ఆర్ఎక్స్100’ నిర్మాత అశోక్రెడ్డి పేరు
దేవరాజ్ రెడ్డిని విచారించిన పోలీసులు
మన తెలంగాణ/సిటిబ్యూరో: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో గంటకో ట్విస్టు బయటికి వస్తోంది. మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లలో నటించిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు రెడ్డి ఎస్ఆ ర్ నగర్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం విచారణకు వచ్చిన దేవరాజును ఎస్ఆర్ నగర్ పోలీసులు సుమారు ఏడు గంటల పాటు విచారణ చేశారు. పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
ఈ కేసులో ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్రెడ్డి పేరు దేవరాజు రెడ్డి బయట పెట్టడంతో సంచలనంగా మారింది. శ్రావణినిని అశోక్ రెడ్డి చాలా బాగా చూసుకున్నాడని, అందుకే తాను పక్కకు తప్పుకున్నట్లు తెలిపాడు. శ్రావణి ఆత్మహత్యకు కారణం ఆమె కుటుం బ సభ్యులు, అశోక్రెడ్డి కారణమని దేవరాజు రెడ్డి ఆరోపించాడు. ఇంత జరుగుతున్నా అశోక్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నాడు. తనను కాదని సాయితోపాటు అశోక్రెడ్డితో కూడా ఆమె సన్నిహితంగా ఉండేదని ఆరోపించాడు. అశోక్ రెడ్డి ఎటిఎం కార్డ్ను శ్రావణి వాడేదని, ఆయన కూడా ఆమెను పర్సనల్గా చూసుకునేవాడని తెలిపాడు.
కాగా సాయిరెడ్డి, దేవరాజు రెడ్డి ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ దిశగా విచారణ చేయనున్నట్లు తెలిసింది. ఇద్దరి విచారణ తర్వాత శ్రావణి కుటుంబ సభ్యులను విచారించనున్నట్లు తెలిసింది. సాయిరెడ్డిని, అశోక్రెడ్డిని కూడా శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వీరిని విచారించిన తర్వాత శ్రావణి ఆత్మహత్యకు ఎవరు కారణమో తెలుసుకోనున్నారు.
స్వగ్రామంలో శ్రావణి అంత్యక్రియలు…
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి శ్రావణి అంత్యక్రియలు ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలోని స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి.