Monday, April 29, 2024

మద్యం నియంత్రణపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

 Alcohol Control

 

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియంత్రణ పై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ కు మంగళవారం రాజ్ భవన్‌లో టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలొ 17,952 మద్యం షాపులు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో మహిళల పై ఆత్యాచార సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని వినతి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

The focus should be on Alcohol Control
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News