Monday, April 29, 2024

చెరువులో దూకిన ముగ్గురు యువతులు…

- Advertisement -
- Advertisement -

Three women fell into Lake

 

గాంధీనగర్: జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురు యువతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు మృతదేహాలు బయటకు తీయగా వందన అనే యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక, వందనగా గుర్తించారు. ముగ్గురు యువతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు వివాహం కాగా మరో యువతి ఇంటర్ చదువుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News