అబ్దుల్లాపూర్మెట్: టిప్పర్ లారీ బ్రేక్ ఫెయిల్ అయి ప్రయాణికుల ఆటో పై పల్టీ కొట్దింది. దీంతో ఆటోలోని పలువురు ప్రయాణికులకు గాయలు కావడంతో పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్టేషన్ పరిధిలోని బాటసింగారంలో చోటుచేసుకుంది. సిఐ స్వామి కథనం ప్రకారం… అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం దేశ్ముఖ్ చౌరస్తాలో (ఎపి 28వి 5854) ఆటో ప్రయాణికులతో వెళ్తుంది. అదే సమయంలో టిప్పర్ లారీ (టిఎస్ యూబి 5009) కంకరఫౌడర్ లోడ్తో వస్తుండగా బ్రేక్ ఫెయిల్ అయింది. అదుపు తప్పి ఆటో పై దూసుకెళ్లి ఫల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న సెయింట్ మేరిస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి నరేందర్(21) తీవ్రంగా గాయపడ్డాడు. మారో 7 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tipper hits passenger auto in Abdullahpurmet