Monday, April 29, 2024

తిరుమలలో భారీగా రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం వెంకన్న దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శ్రావారి సేవసదన్ వరకు లైన్ వేచి ఉన్నారు. దీంతో స్వామివారిని దర్శించుకోవాడినికి భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. తెల్లవారుజామునుంచి స్వామివారికి దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు భక్తులు.

కాగా, శుక్రవారం వెంకన్నను 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 31,245 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.41కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News