- Advertisement -
లాహార్ : పాకిస్థాన్ ప్రభుత్వం ఎంతో ఒత్తిడిపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు అప్పగించిందని వివాదాస్పద వ్యాఖ్య చేసిన సీనియర్ విపక్షనాయకుడు సర్దార్ అయాజ్ సాదిక్పై దేశద్రోహం కేసు నమోదు చేయడానికి పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సమయంలో కాళ్లు వణికాయని, ముచ్చెమటలు పట్టాయని, పాక్ విదేశాంగ మంత్రి తనకు చెప్పినట్టు పాక్ ముస్లిం లీగ్ నవాజ్ నేత సర్దార్ అయాజ్ సాదిక్ బుధవారం వెల్లడించడాన్ని పాకిస్థాన్అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజాజ్ షా తీవ్రంగా తప్పుపట్టారు. సాదిక్పై అనేక ఫిర్యాదులు వచ్చాయని ఎజాజ్ పాత్రికేయులకు చెప్పారు. ఎవరైతే భారత్కు మద్దతుగా ఉంటున్నారో వారు అమృతసర్కు తరలిపోవడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -