Monday, April 29, 2024

ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు…. విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు

- Advertisement -
- Advertisement -

జన్మదినోత్సవం రోజున విరియనున్న హరితవనం…. ప్రిన్స్ పిలుపుతో పెరగనున్న పచ్చదనం
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజున విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు

Trees planted in Mahesh babu Birth day

మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ హీరో మహేశ్ బాబు పిలుపునివ్వడంపై గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన అభిమానులకు తలా మూడుమొక్కలు నాటాలని పిలుపునివ్వడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై హీరో మహేశ్‌బాబుకున్న అభిమానానికి ఇది నిదర్శనమని, అది గొప్ప విషయమని ఎంపి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. జన హృదయాల్లో ప్రిన్స్‌గా ఉన్న సూపర్ స్టార్ మహేశ్‌బాబు పిలుపు తన హృదయాన్ని కదిలించిందని ఎంపి సంతోష్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు వంటి గొప్పవ్యక్తుల మద్ధతుతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతుందని, ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా మహేశ్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
రేపటి తరాలకు ప్రకృతి పచ్చదనాన్ని అందించాలి: ఎంపి సంతోష్‌కుమార్
గతంలో కూడా తన పుట్టినరోజును పురస్కరించుకొని హీరో మహేశ్‌బాబు మొక్కలు నాటారని ఎంపి సంతోష్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. భౌతిక ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదని, రేపటి తరాలకు మనం కూడబెట్టాల్సింది, వారు సుఖంగా జీవించడానికి కావాల్సిన ప్రకృతి పచ్చదనాన్ని అందించడమే మన కర్తవ్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొంటారని ఎంపి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో తాను కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహేశ్ బాబు పాలుపంచుకోవడం గొప్ప విషయమని, అది ఆయన అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్నారు.
మహేశ్‌బాబు పేరుతో నాటుతున్న మొక్కలు వృక్షాలుగా పెరిగి
పచ్చదనం పలచబడడంతో విశ్వ వేదికమీద ప్రకృతి సమతుల్యత రోజు రోజుకూ దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఎంపి పునరుద్ఘాటించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నేపథ్యంలో ప్రపంచ పర్యావరణం పట్ల మహేశ్ బాబు వంటి ప్రజాదరణ కలిగిన ప్రముఖ హీరోలు ప్రకృతి కోసం మనసు కేంద్రీకరించడం మహోన్నతమైన విషయమన్నారు. మహేశ్ బాబు పిలుపు మేరకు అగస్టు 9వ తేదీన మనిషికి ఒక్కంటికి మూడు మొక్కలు నాటుతున్న మహేశ్‌బాబు అభిమానులకు ఎంపి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మహేశ్‌బాబు పేరుతో నాటుతున్న మొక్కలు వృక్షాలుగా పెరిగి పెద్దవై ఎందరికో నీడనిస్తూ చిరకాలం నిలుస్తాయని ఎంపి సంతోష్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News