Monday, April 29, 2024

గెల్లు శ్రీనును… గెలుపు శ్రీనుగా మారుస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Comments On Dalitbandhu

హుజూరాబాద్: చావునోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీణవంకలో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.  హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెల్లు శ్రీనును గెలిపించి గెలుపు శ్రీనుగా మారుస్తామన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి సిఎం కెసిఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. వీణవంక ఆస్పత్రిని ఆధునీకరిస్తామని, ఆస్పత్రిలో 24 గంటలు సేవలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల కరెంట్ ఇస్తామంటే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని, ఇవాళ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మెచ్చుకున్నారు. నీటి తీరువా రద్దు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హరీష్ రావు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు…. సచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి అమ్మేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News