Monday, April 29, 2024

ఆషాడం బోనాలకు రూ. 15 కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

TS Govt Released Rs 15 crore for Ashadam Bonalu 2021

హైదరాబాద్: ఆషాడ బోనాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయని మహాంకాళి ఆలయం ఆవరణలో రాంగోపాల్‌పేట, మోండా మార్కెట్ డివిజన్లకు చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించాలనే సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రజలు కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మహాంకాళి ఆలయం ఈవో మనోహర్ రెడ్డి, మాజీ కార్పోరేటర్‌లు అత్తిలి అరుణ్‌గౌడ్,ఆకుల రూప, వివిధ దేవాయాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News