హుండీ, ఆటో, రూ.15,000 నగదు స్వాధీనం
హైదరాబాద్: రాత్రి సమయంలో ఆటోలో తిరుగుతూ దేవాలయాల్లోని హుండీలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను లంగర్హౌస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15,000 నగదు, ఆటో, హుండీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని టపాచపుత్రకు చెందిన షేక్ ఈసా బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. టోలీచౌకికి చెందిన సయిద్ అహ్మద్ హుస్సేన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు చేస్తున్న పనిలో వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో చోరీలు చేస్తున్నారు.
దేవాలయం సమీపంలో ఆటోలు తిరుగుతూ భక్తులు, పూజారులు లేని సమయంలో లోపలికి వెళ్లి చోరీలు చేస్తున్నారు. హుండీలలోని డబ్బులు తీసుకుని జాల్సాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 26వ తేదీన లంగర్హౌస్, మారుతి నగర్లోని గౌరీ శంకర్ మారుతి దేవాలయంలో హుండీని చోరీ చేశారు. తెల్లవారి వచ్చిన పూజారి వడాలి మార్కండేయ శర్మ హుండీ చోరీకి గురైన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్హౌస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై 380 ఐపిసి,457 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని అన్నారు.