మన తెలంగాణ/హైదరాబాద్ : రాహుల్ సిప్లిగంజ్ మీద పబ్లో జరిగిన దాడిపై నటుడు ప్రకాష్రాజ్ స్పందించారు. కాగా బిగ్బాస్-3 విన్నర్ రాహుల్పై ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడిలో రాహుల్ తలపై ఎమ్మెల్యే సోదరుడు బీరు బాటిల్ పగులగొట్టాడు. దాంతో అతడి తలకు గాయం కాగా అతడ్ని వెంటనే పబ్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన అనంతరం రాహుల్ ఘటనపై పోలీసులకు రాహుల్ ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మీడియా ముందు అన్నాడు. కాగా ఈ విషయమై రాహుల్ కేటిఆర్కు సైతం ట్వీత్ చేసి తాను టీఆర్ఎస్ అభిమానినే తనకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
కాగా రాహుల్పై జరిగిన దాడిని ఇప్టపికే పలువురు సెలబ్రిటీలు వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్కు న్యాయం జరగాలని సింగర్ నోయల్, వరుణ్సందేశ్ పోస్ట్లు పెట్టారు. కాగా ఈ దాడిపై స్పందించిన ప్రకాష్రాజ్ రాహుల్కు అన్యాయం జరిగిందన్నారు. పబ్లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. వినయ్ భాస్కర్ను కలవడంలో ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్ను కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాహుల్ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్ కావాల్సిన అవసరమేంటన్నారు.