- Advertisement -
హైదరాబాద్: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే, కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో మంగళవారం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు.
Yellandu MLA Haripriya Join in NIMS hospital due to Corona
- Advertisement -