Sunday, April 28, 2024

మీ సేవలు నిబద్దతతో అందరి మన్ననలు పొందాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట: మీ సేవలు నిబద్దతతో అందరి మన్ననలు పొందాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5న ఐటి పారిశ్రామిక ఉత్సవం పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఇన్పర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, మీసేవా సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఐటిఅండ్ సి , మీసేవ ప్రతినిధులందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. మీ సేవ, సి-విఎల్ ఈఎస్‌లు చేస్తున్న సేవలను కొనిమాడారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గత సంవత్సరం చేసినసేవలకు గాను ఈ సేవ నుంచి రాజు, టిఎస్ టిఎస్ నుంచి శ్రీనివాస్, టిఎస్ ఆన్‌లైన్ నుంచి ఉపేందర్, ఓఎస్‌ఎస్ నుంచి సంతోషి, సిఎస్‌సి నుంచి రవి, అందరిని అభినందించారు. జిల్లాలో మీసేవలో జరిపే లావాదేవిలు 2016 నుంచి 2023 మే వరకు 85 లక్షల పై చిలుకు జరిగాయన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవలను అత్యంత నిబద్దతతో ప్రజలకు అందిస్తూ అందరి మన్ననలను ఎప్పటికి ఇలాగే పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రహమాన్, ఈడిఎం ఆనంద్, మీసేవ జిల్లా మేనేజన్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News