Monday, April 29, 2024

ఎపి సిఎంకు షర్మిల రాఖీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ఆర్‌టిపి కార్యాలయంలో ఆదివారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎపి సిఎం జగన్ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు.’నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.నిరుద్యోగుల అంశంపై తమ పార్టీ మొదటి నుంచి దీక్షలు చేస్తోందని, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో వందకుపైగా నిరుద్యోగ అభ్యర్థులను బరిలో దించుతామని.. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila Rakhi greetings to AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News