- Advertisement -
హైదరాబాద్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నెలన్నర తరువాత నిద్ర నుంచి లేచారని, బిజెపి నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. బస్సులో వలస కూలీల తరలింపు సాధ్యం కాదని నిన్ననే కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి చెప్పామని, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వలస కూలీలు తరలించాలని కేంద్రానికి సూచించామన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా రోగుల సంఖ్య 1038కి చేరుకోగా 28 మంది మృత్యువాతపడ్డారు.
Congress leaders sleeping from month says talasani
- Advertisement -