- Advertisement -
బోపాల్: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదమూడు మంది మృతిచెందగా… మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదం ఫిరోజాబాద్ లోని నాగ్లాంఖాంగార్ లో ఆగ్రా- లక్నో హైవేపై ప్రవేట్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవిందిచింది. బస్సు ఢిల్లీ నుంచి బీహార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా, యుపి సిఎం యోగి అధిత్యనాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
13 killed 31 injured in bus truck collision in Uttar Pradesh
- Advertisement -