కొత్తగా 2534 కేసులు, 11 మంది మృతి
1,50,176 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య లక్ష 50 వేలు దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటి వరకు 1,50,176 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం 63,017 మందికి పరీక్షలు చేయగా 2534 మందికి పాజిటివ్ తేలింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 327 మంది ఉండగా, ఆదిలాబాద్లో 23, భద్రాద్రి 81,జగిత్యాల 65, జనగాం 41, భూపాలపల్లి 24, గద్వాల 29, కామారెడ్డి 123, కరీంనగర్ 107,ఖమ్మం 109, ఆసిఫాబాద్ 30,మహబూబ్నగర్ 38, మహబూబాబాద్ 73, మంచిర్యాల 64, మెదక్ 42, మేడ్చల్ మల్కాజ్గిరి 132, ములుగు 16, నాగర్కర్నూల్ 62, నల్గొండ 149,నారాయణపేట్ 16, నిజామాబాద్ 90, పెద్దపల్లి 58 ,సిరిసిల్లా 47, రంగారెడ్డి 195, సంగారెడ్డి 96, సిద్ధిపేట్ 103, సూర్యాపేట్ 83, వికారాబాద్ 22,వనపర్తి 42, వరంగల్ రూరల్ 41, వరంగల్ అర్బన్ లో 124, యాదాద్రిలో మరో 57 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా వైరస్ దాడిలో మరో 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,50,176కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 1,17,143కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 32,106 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 25,066 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 927 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 33 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా, 1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
19.50 లక్షలకు పెరిగిన కోవిడ్ పరీక్షలు..
రాష్ట్రంలో కరోనా టెస్టులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19,53,571 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అంటే ప్రతి పది లక్షల మందిలో సగటున 52,619 మందికి టెస్టులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తేలిన పాజిటివ్లలో 69 శాతం మందికి అసింప్టమాటిక్, 31 శాతం సింప్టమాటిక్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
2534 new Covid 19 cases reported in Telangana