Monday, April 29, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Accident

 

అమరావతి: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంట‌పాడు మండ‌లం ఆలంపురం గ్రామ స‌మీపంలో అదుపుత‌ప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యాన్‌లో ఉన్న థ‌యోనైల్ క్లోరైడ్ కంటైన‌ర్ లీకై భారీగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న ముగ్గురు వ్య‌క్తులు ఆ మంట‌ల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

3 killed after Fire broke out in Van

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News