- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 596 కొత్త కోవిడ్-19 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 927 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. ఈ వైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 1470 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా 2,62,751 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 6,465 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 102 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి.
596 New Covid-19 Cases Reported in Telangana
- Advertisement -