- Advertisement -
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 5జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య ఉండొచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం తెలిపారు. ఆయన టైమ్ నౌ సదస్సు 2021లో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. వేలం వ్యవహారాన్ని చూసే ట్రాయ్ ఈ విషయంపై ఇంకా చర్చలు జరుపుతోందని, అయితే తన నివేదికను 2022 ఫిబ్రవరి వరకు సమర్పించే అవకాశం ఉందన్నారు. ట్రాయ్ నివేదికను సమర్పించేంత వరకు ఇతర వివరాలు తెలిపేందుకు మంత్రి నిరాకరించారు. టెలిఫోన్ రంగంలో మరిన్ని మార్పులు తెచ్చేందుకు కేంద్రం చూస్తోందని కూడా ఆయన తెలిపారు. అంతర్జాతీయ రెగ్యులేషన్ స్థాయికి చేరుకోడానికి సంస్కరణలు తేనున్నామని అన్నారు. ఫిబ్రవరి నాటికి 5జి స్టాక్ దాదాపు 70-75 శాతం రెడీ అయిపోగలదని కూడా వైష్ణవ్ తెలిపారు. ఆ తర్వాత 6జి కూడా రానున్నది.
- Advertisement -