Monday, April 29, 2024

రాష్ట్రంలో మరో 6,542 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

6542 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 6,542 మందికి వైరస్ సోకింది. కరోనాతో మరో 20 మంది మృతి చెందారు. అదే సమయంలో 2,887 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,488 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో నిన్న 1,30,105 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 898 మందికి కరోనా సోకింది. మేడ్చల్ లో 570, రంగారెడ్డి 532, నిజామాబాద్ 427, సంగారెడ్డి 320, నల్గొండలో 285, మహమూబ్ నగర్ 263, వరంగల్ అర్బన్ 244, జగిత్యాల 230, ఖమ్మం 246, కామారెడ్డి 235 మంది బాధితులకు కొత్తగా కరోనా వైరస్ సోకిందని వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

6542 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News