Friday, May 17, 2024

ఎపిలో కొత్తగా 7,948 పాజిటివ్‌ కేసులు.. 58 మంది మృతి

- Advertisement -
- Advertisement -

7948 New Corona Cases Reported in AP

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న‌ది. దీంతో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 62,979 శాంపిళ్ల‌ను పరీక్షించగా.. కొత్తగా 7,948 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 58 మంది బాధితులు మృతి చెందారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,10,297కు చేరుకుంది.ఇప్పటివరకు ఎపిలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 1148కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 52,622 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 56,527 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 17 లక్షల 49వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

7948 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News