Sunday, April 28, 2024

చెరువులో బోల్తా పడ్డ ఆటో: 8మందికి తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

8 Injured for Auto rammed into pond in Rangareddy

రంగారెడ్డి: జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొందుర్గ్ మండల పరిధిలోని మహదేవ్ పూర్ గ్రామ చెరువు కట్ట పైనుండి రామచంద్రాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆటోలో నుంచి గాయపడినవారిని బయటకు తీశారు. గాయపడినవారిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మోహన్ రావు, కూర్మా రావులు కూడా ఉన్నారు. లాక్డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఆటోలు ప్రయాణం కొనసాగించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

8 Injured for Auto rammed into pond in Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News