Monday, May 27, 2024

పెళ్లి వేడుకలో పాల్గొన్న సర్పంచ్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

పాట్నా : కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో లాక్ డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా ప్రేమ జంటకు పెళ్లి చేసిన సర్పంచ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రహ్మాపూర్ గ్రామ పంచాయతీలోని ఛత్ర గ్రామంలో ఏప్రిల్ 8వ తేదీన ఓ పెళ్లి వేడుకకు గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామస్థులు సామాజిక దూరంతో పాటు మాస్కులు ధరించలేదు. యువతి, యువకుడు ప్రేమించుకోవడంతో గ్రామ సర్పంచ్ దగ్గర ఉండి వారి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి వెయ్యి మంది వరకు హాజరైనట్టు సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Case registered on Bihar Sarpanch with Corona virus

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News