- Advertisement -
2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధఢక్’ మూవీతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. ఈ యంగ్ బ్యూటీ తన రెండవ చిత్రంలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. ఆమె కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఉమెన్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్లో నటిస్తోంది. ‘గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ చిత్రం డైరెక్ట్గా నెట్ ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. థియేటర్స్ విడుదల లేకుండా వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- Advertisement -