- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించేందుకు వెళ్తుండగా చెంగిచెర్ల ఐఓసి వద్ద బైక్, డీజిల్ ట్యాంక్ర్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్పై వెళ్తున్న అన్నా, చెల్లెలుకు గాయాలయ్యాయి. అటువైపు నుంచి వెళ్తున్న సిపి మహేష్భగవత్ వెంటనే కారు నుంచి కిందికి దిగి తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ను తీసుకుని వారికి స్వయంగా చికిత్స చేశారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
- Advertisement -