- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : సినీనటుడు పృథ్వీరాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. టిక్టాక్ తదితర సోషల్ మీడియా యాప్లతో తన వీడియోలను ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Actor Prithviraj complains to cyber crime police
- Advertisement -